Tuesday, 29 April 2025 11:49:23 PM
# రతన్ టాటా మృతి పట్ల ఏపీ సీఎం ప్రగాఢ సానుభూతి # పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ # దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి.. # ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు.. విజయవంతంగా తొలగించిన ఇంజినీర్లు # టెన్త్‌ పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. # 18న ఏపీ కేబినెట్ భేటీ- వరదల నియంత్రణ, అమరావతిపై కీలక నిర్ణయాలు..! # ముంబై నటిపై వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. # దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ? # గురువారంనాటి రాశిఫలాలు.. వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి.. # తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! # మూడు నెలలపాటు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. # ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన డిప్యూటీ సీఎం # రాజమండ్రిలో చిరుత కలకలం.. భయాందోళనలో స్థానికులు # బిగ్ అలెర్ట్...! ఏపీకి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. # జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు # బుడమేరులో రంగంలోకి 120 మంది మద్రాస్‌ బెటాలియన్‌ జవాన్ల రాక # జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ - వారధి ట్రస్ట్ # హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..! మాజీ మంత్రి జోగి రమేష్‌ ఎక్కడ..? # ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు వైరల్ ఫీవర్.. # ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం..

దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి..

Date : 18 September 2024 01:28 PM Views : 542

TN 24X7 - వార్తలు / : దసరా నవరాత్రి ఉత్సవాలు 2024 అక్టోబర్ 03వ తేదీ గురువారం ఘట స్థాపనతో మొదలై.. అక్టోబర్ 12, శనివారం విజయ దశమి వేడుకతో ముగుస్తాయి. ఈ సమయంలో తొమ్మది రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. ఈ నేపధ్యంలో దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు జరుగనున్న దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయాధికారులు. నవరాత్రులకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులు శరవేగంగా చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దసరా వచ్చిందంటే చాలు నవరాత్రుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు దుర్గమ్మను సందర్శించుకుంటారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. గతేడాది దసరా ఉత్సవాలకు 13 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య కన్నా మరో లక్ష అదనంగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకు అధికారులు పెద్ద పీట వేస్తున్నారు. సర్వ దర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు అన్ని దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా విపరీతమైన ఎండ కాసినా.. వర్షం వచ్చినా క్యూలైన్లలో ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటిలాగే వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూ లైన్స్‌ ఘాట్‌ రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రికి వెళ్తాయి.

TN 24X7

Admin

TN 24X7

మరిన్ని వార్తలు

Copyright © TN 24X7 2025. All right Reserved.



Developed By :