Wednesday, 30 April 2025 12:28:43 AM
# రతన్ టాటా మృతి పట్ల ఏపీ సీఎం ప్రగాఢ సానుభూతి # పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ # దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి.. # ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు.. విజయవంతంగా తొలగించిన ఇంజినీర్లు # టెన్త్‌ పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. # 18న ఏపీ కేబినెట్ భేటీ- వరదల నియంత్రణ, అమరావతిపై కీలక నిర్ణయాలు..! # ముంబై నటిపై వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. # దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ? # గురువారంనాటి రాశిఫలాలు.. వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి.. # తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! # మూడు నెలలపాటు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. # ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన డిప్యూటీ సీఎం # రాజమండ్రిలో చిరుత కలకలం.. భయాందోళనలో స్థానికులు # బిగ్ అలెర్ట్...! ఏపీకి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. # జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు # బుడమేరులో రంగంలోకి 120 మంది మద్రాస్‌ బెటాలియన్‌ జవాన్ల రాక # జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ - వారధి ట్రస్ట్ # హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..! మాజీ మంత్రి జోగి రమేష్‌ ఎక్కడ..? # ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు వైరల్ ఫీవర్.. # ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం..

18న ఏపీ కేబినెట్ భేటీ- వరదల నియంత్రణ, అమరావతిపై కీలక నిర్ణయాలు..!

Date : 14 September 2024 11:29 AM Views : 552

TN 24X7 - వార్తలు / : ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు కేబినెట్ సమావేశాలు జరిగాయి. అయితే వాటన్నింటి కంటే ముఖ్యంగా ఈసారి కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ నెల18న జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వరదల నియంత్రణ, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు ఉంటాయని తెలుస్తోంది. విజయవాడ నగరంపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వరదల నియంత్రణ కోసం బుడమేరు ఆధునికీకరణ, ఆక్రమణల తొలగింపు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభంపై ఈసారి కేబినెట్ లో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ వరదలపైనా ఆరా తీశారు. అయితే అమరావతి రాజధానికి వరదల ముప్పు లేదని వారికి సీఆర్డీఏ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కలిపి 15 వేల కోట్ల మేర రుణం అందించే అవకాశాలున్నాయి. అలాగే రాష్ట్రంలో మరికొన్ని ఇతర అంశాలపైనా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

TN 24X7

Admin

TN 24X7

మరిన్ని వార్తలు

Copyright © TN 24X7 2025. All right Reserved.



Developed By :