Tuesday, 29 April 2025 11:51:53 PM
# రతన్ టాటా మృతి పట్ల ఏపీ సీఎం ప్రగాఢ సానుభూతి # పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ # దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి.. # ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు.. విజయవంతంగా తొలగించిన ఇంజినీర్లు # టెన్త్‌ పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. # 18న ఏపీ కేబినెట్ భేటీ- వరదల నియంత్రణ, అమరావతిపై కీలక నిర్ణయాలు..! # ముంబై నటిపై వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. # దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ? # గురువారంనాటి రాశిఫలాలు.. వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి.. # తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! # మూడు నెలలపాటు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. # ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన డిప్యూటీ సీఎం # రాజమండ్రిలో చిరుత కలకలం.. భయాందోళనలో స్థానికులు # బిగ్ అలెర్ట్...! ఏపీకి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. # జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు # బుడమేరులో రంగంలోకి 120 మంది మద్రాస్‌ బెటాలియన్‌ జవాన్ల రాక # జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ - వారధి ట్రస్ట్ # హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..! మాజీ మంత్రి జోగి రమేష్‌ ఎక్కడ..? # ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు వైరల్ ఫీవర్.. # ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం..

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి భువనేశ్వరి భారీ విరాళం

Date : 04 September 2024 02:17 PM Views : 541

TN 24X7 - వార్తలు / : ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్‌, చిట్టినగర్‌, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, విష్వక్‌సేన్, అనన్య నాగళ్ల, సిద్ధ జొన్నలగడ్డ, అశ్వనీదత్, త్రివిక్రమ్.. వంటి సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. తాజాగా హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణల్లో వరద సహాయక చర్యల కోసం ఒక్కో రాష్ట్రానికి కోటి రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తెలుగు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని భువనేశ్వరి గుర్తు చేశారు. వరదల ఎన్నో కుటుంబాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని, ప్రతి ఒక్కరికీ హెరిటేజ్ ఫుడ్స్ అండగా ఉంటుందని అన్నారు. రెండు రాష్ట్రాలు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు.

TN 24X7

Admin

TN 24X7

మరిన్ని వార్తలు

Copyright © TN 24X7 2025. All right Reserved.



Developed By :