TN 24X7 - వార్తలు / : కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ ను టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శించుకున్నారు. అతని వెంట ఆమె తల్లి, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఎన్టీఆరే వెల్లడించారు. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ విజిట్ కు సంబంధించి న ఫొటోలు షేర్ చేస్తూ.. అమ్మ పుట్టిన రోజుకు కేవలం రెండు రోజుల ఇలా చేయడం ఆమెకు తానిచ్చిన అత్యుత్తమ బహుమతి అని ఎమోషనల్ అయ్యాడు. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి’ అని ఎన్టీఆర్ సామాజిక మాధ్యమాల వేదికగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా రిషబ్ శెట్టి ఎన్టీఆర్, అతని తల్లిని స్వయంగా ఉడిపికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం ఉడిపి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కు కర్ణాటకతో ప్రత్యేక బంధం ఉంది.ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్కి కన్నడ చిత్ర పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉంది. పునీత్ రాజ్కుమార్, జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు. అప్పు అంతిమ సంస్కారాల్లోనూ పాల్గొన్నారు తారక్. ఇప్పుడు రిషబ్ శెట్టితో కలిసి ఉడిపి కృష్ణుడిని దర్శించుకోవడానికి వచ్చారు.
Admin
TN 24X7